- Advertisement -
మంత్రివర్గంలో ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధంగా నిర్వహిస్తానని కేంద్రంలో మంత్రి అవుతున్న టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ నుంచి ఫోన్ అందుకున్న సుజనా చౌదరి తదుపరి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ను కలవడానికి వచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఏ బాద్యత అప్పగించినా ఒకే అన్నారు.తన శక్తి వంచన లేకుండా రాష్ట్రాభివృద్దికి పాటు పడతానని ఆయన అన్నారు.సుజన చౌదరి రాజకీయాలలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో విశేషంగా ఎదిగారని చెప్పవచ్చు.రాజ్యసభ సభ్యుడు అవడం,తెలుగుదేశం అధికారంలోకి రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించడం, అదికారంలోకి వచ్చాక రాజధాని కమిటీ. వనరుల కమిటీ..ఇలా పలు హోదాలలో ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారు.