ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఉద్యమం తీవ్రమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక ఢిల్లీలో కూడా ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఆదివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం ఎదుట తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎంపీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఇబ్బందులను చూసి అక్కినేని నాగేశ్వర్ రావు మనవడు, సినీ నటుడు సుమంత్ తెగ బాధపడ్డాడు. ముఖ్యంగా ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్ను చూసి ఆవేదనకు గురవుతూ సోమవారం ట్వీట్ చేశాడు.
ఇలాంటి చర్యకు గురైన వారిలో ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు. అలా జయదేవ్కు జరగడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందంటూ హీరో సుమంత్ పోస్ట్ పెట్టారు. ‘నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అంటూ పేర్కొన్నాడు.
అయితే ఈ ట్వీట్పై అభిమానులు స్పందించారు. వాళ్లు పోరాడుతున్నారు.. మీరు కూడా ఉద్యమంలోకి రావొచ్చు కదా అని కౌంటర్ ఇచ్చారు.
It pains me to see this happen to one of the best I know! #JayGalla @JayGalla #APDemandsJustice https://t.co/dWujwcr5TL
— Sumanth (@iSumanth) April 9, 2018