కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్కు షాక్ తగిలింది. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సునంద భర్త, కాంగ్రెస్ నేత శశి థరూర్ను నిందితుడిగా చేర్చారు. థరూరే సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని అందులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో తొలి అడుగు పడినట్లైంది.
సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సునంద భర్త, కాంగ్రెస్ నేత శశి థరూర్ను నిందితుడిగా చేర్చారు. సునందది ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం (మే 14) మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ మందు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో తొలి అడుగు పడినట్లైంది.
సునందా పుష్కర్ 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్లో రూమ్ నంబర్ 345లో అమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సునంద విష ప్రభావం వల్లే మృతిచెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించటంతో ఈ కేసులో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే అల్ప్రాక్స్ మత్తు పదార్థం ఆమె శరీరంలో మోతాదుకు మించిన ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం కేసును మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.