Saturday, May 18, 2024
- Advertisement -

కోడిపందాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇదే…

- Advertisement -

ఏపీలో కోళ్ల పందేలపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జరగనున్న కోడి పందేలపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పే ఈసారి కూడా వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ బెంచ్ వెల్లడించింది. తనిఖీల పేరుతో పోలీసులు ప్రాంగణాల్లోకి వెళ్లి కోళ్లను పట్టుకోవద్దని, రైతులను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పులో ఏమైనా మార్పులు కొరవచ్చని పిటిషనర్కు సుప్రీం సూచించింది. బీజేపీ నేత రఘురామకృష్ణం రాజు ఆశించిన విధంగానే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీలో కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంలో ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -