Monday, April 29, 2024
- Advertisement -

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు.

- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ను హైదరాబాదులోని తన నివాసంలో 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు బెయిల్ పిటిషన్‌ తిరస్కరించింది. పోలీసులు తన కాళ్లు వాచిపోయేలా కొట్టారని.. రాత్రంతా వేధింపులకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. జీజీహెచ్‌ లో 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. రఘురామకృష్ణంరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్‌ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు.

హైకోర్టు బెయిల్ పిటిషన్‌ తిరస్కరించడంతో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించమని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి రఘురామను తీసుకొచ్చారు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించి. వైద్యపరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు అందించారు.

తన తండ్రి రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు భరత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌ కొట్టివేయాలని, పోలీసు కస్టడీకి అప్పగించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది.

రఘురామకృష్ణరాజు వైద్యపరీక్షల నివేదిక ను పరిశీలించిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి రఘురామకృష్ణరాజు బెయిల్ మంజూరు చేసింది.

రఘురామకృష్ణరాజుకు ఎడీమా ఉందని.. శరీరంపైన ఎలాంటి గాయాలూ లేవని.. ఆయన పాదాల రంగు మారడానికి కారణం ఎవరో కొట్టడం వల్లకాదని వైద్యపరీక్షల నివేదిక స్పస్టంచేసినట్లు సమాచారం. ఇరు వాదనల విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజు ఆరోగ్య దృష్ట్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -