- Advertisement -
తలసాని శ్రీనియాస్ యాదవ్ మరోసారి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసిబి గురించి చంద్రబాబు చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏసిబి నోటీసులు తీసుకోక పోతే మెడలు పట్టి జైలుకు పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్ నగర శివారులోని కుత్బుల్లాపూర్లో పర్యటిస్తూ ఫాక్స్ సాగర్ను మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతామని తలసాని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి వారు తప్పు చేసి దబాయిస్తున్నారని, తప్పు ఒప్పుకుని విచారణకు సహకరించి నిర్దోషిగా నిరుపించుకున్నవాడే అసలైన నాయకుడు అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.