Saturday, May 18, 2024
- Advertisement -

నోబెల్ శాంతి బ‌హుమ‌తికి మోదీ పేరు నామినేట్‌…

- Advertisement -

ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వారికి గౌరవసూచికంగా ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని భారత ప్రధాని నరేంద్ర మోదీ నామినేట్ అయ్యారు. మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్ ప్రతిపాదించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వారు కోరారు. నోబెల్‌కు పేర్లను నామినేట్ చేసేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో ప్రక్రియ ప్రారంభమవుతోంది. నామినేషన్ల ప్రక్రియ 2019, జనవరి 31న ముగుస్తుంది. మోదీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న తన ప్రతిపాదనకు దేశ ప్రజలు అందరూ మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -