Tuesday, May 28, 2024
- Advertisement -

ఎన్ని కష్టాలు.. ఢిల్లీలో గంటకో బీజేపీ నేత వద్దకు బాబే!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారం లో వాయిస్ తో సహా ఇరుక్కొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తనను కాపాడగలిగింది కేవలం భారతీయ జనతా పార్టీ నేతలే అని భావిస్తున్నాడా? ఈ అంశంలో తన మీద కేసు నమోదు చేయకుండా చూసుకోగలిగిన శక్తి.. తనను అరెస్టు చేయకుండా చూడగల శక్తి కమలనాథులకు మాత్రమే ఉందని ఆయన భావిస్తున్నారా?!

ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం ఈ అభిప్రాయాలు కలుగుతున్నాయి!

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ బుధవారం రోజున ప్రతి గంటకూ ఒక భారతీయ జనతా పార్టీ నేతను కలుస్తున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచి బాబు వరస భేటీలతో బీజీ అయ్యాడు. ఏపీకే చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో మొదలు.. అనేక మంది కమలనాథులను కలుస్తున్నాడు చంద్రబాబు. వీరందరితోనూ బాబు ఒకే అంశం గురించి చర్చిస్తున్నాడు. ఓటుకు నోటు వ్యవహారంలో తనకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే బాబు ప్రయత్నాల పరమార్థం.

సాయంత్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో.. చివరగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కావడంతో బాబు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వీరందరితో సమావేశం అయ్యి.. ఓటుకు నోటు వ్యవహారం గురించి వివరణ ఇచ్చుకొని బాబు ఈ వ్యవహారం నుంచి బయటపడే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.. బీజేపీ నేతలు బాబును ఎలా రక్షిస్తారో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -