- Advertisement -
రోజు రోజుకి బాలికలపై అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి.నిన్న(ఆదివారం)బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన యువకుడు టీడీపీ నేత కుమారుడు కావడం గమనార్హం.గుంటూరు జిల్లా అమృతలూరుకి చెందిన టీడీపీ నేత నాగేశ్వరరావు గతంలో కూచిపూరి నీటి సంఘం అధ్యక్షుడుగా విధులు నిర్వర్తించారు. ఆయన కుమారుడు విష్ణుతేజ స్థానికంగా ఉండే ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. తన కొడుకును కాపాడుకునేందకు టీడీపీ నేత నాగేశ్వరరావు విశ్వప్రయత్నాలు చేశారు.బాధిత బాలిక కుటుంబానికి డబ్బులు ఇచ్చి కేసు పెట్టకుండా రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు.