ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ ఓడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆ పార్టీ తీవ్రమైన సంక్షోభలో కూరుకుపోయింది. పార్టీలో ఉన్న నేతలకు బాబు భరోసా కల్పించలేక పోతున్నారు. బాబుకు పై నమ్మకం లేకపోడంతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. జగన్ దెబ్బ కంటె ఇప్పుడు భాజాపా చేపట్టిన ఆపరేషన్ కమలం దెబ్బకు టీడీపీ కుదులవుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారు. పార్టీలో చేరాలనుకున్న భాజాపా అగ్రనాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాబు బిగ్ షాక్ ఇవ్వనున్నారనె చర్చ నడుస్తోంది. పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలు పక్కచూపులు చూడటం టీడీపీ అధినేత చంద్రబాబును కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కాపునేతలంతా సమావేశం అయ్యి తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సంగతి తెలిసిందే.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగురాష్ట్రాల్లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో వంశీ ఆయనతో భేటీ కావడం చంద్రబాబు దగ్గర అల్టిమేటం జారీ చేయడం వంటి పరిణామాలు రాజకీయపరంగా ఆసక్తి రేపుతున్నాయి. వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
కిషన్ రెడ్డితో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భేటీపై అటు బీజేపీ గానీ ఇటు వంశీగానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గత కొద్దిరోజులుగా వల్లభనేని వంశీమోహన్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీనీ ఖాలీ చేయాలని పట్టుదలతో ఉంది. వలసల వల్ల భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. పార్టీని వదిలి వెల్లే వారిని బాబు ఆపగలడా….?