Sunday, May 12, 2024
- Advertisement -

మోడీ ని పోట్టచక్కలు అయ్యేలా నవ్వించిన చంద్రబాబు – ఎంపీ

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం లో ఆసక్తికర పరిణామాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక హోదా మంత్రం పాటిస్తూ అందరూ హడావిడి చేశున్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం కాదు పుష్కరాలకి స్పెషల్ గా మోడీ ని పిలవడానికే డిల్లీ వెళుతున్నా అంటూ చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తానికి మోడీ ని కలిసారు.

అయితే మోడీ ముందర టీడీపీ సీనియర్ నేత , చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెప్పిన మాట  మోడీ దగ్గర చెప్పారట. ఆయన చెప్పిన విషయం విన్న మోడీ పొట్ట చక్కలు అయ్యేట్టు నవ్వారని వినికిడి. మొదటి మోడీ కి శివప్రసాద్ శుభాకాంక్షలు చెప్పినట్టు చెప్పగా ఆ తర్వాత మోడీ తో ఆయన చెప్పిన మంత్రం గురించి చెప్పారు. ఆ తర్వాత ఆయన పెద్ద స్వరంతో మంత్రాన్ని జపించారు.

నరేంద్ర మోదీ – నారా చంద్రబాబులు కలిసి ఏపీని అభివృద్ధి చేయాలని ఎన్నో యుగాల కిందటే నిర్ణయమైందన్న అర్థం వచ్చేలా  నమో నారాయణాయ అంటూ మంత్రాన్ని పఠించారు. ఇందులో నమో అంటే నరేంద్ర మోదీ అని – నారా అంటే నారా చంద్రబాబునాయుడు అని శివప్రసాద్ చెప్పగానే మోడీ ఇక నవ్వు ఆపుకోలేకపోయారట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -