Thursday, May 16, 2024
- Advertisement -

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ కొత్త ప్ర‌చారం….

- Advertisement -

క‌విత‌కు కాదేది అన‌ర్హం …అన్న‌ట్లు..ఎన్నిక‌ల ప్ర‌చారానికి జంతువులు కూడా అతీతం కాద‌న్న‌ట్లు ఉంది టీడీపీ ప‌రిస్థితి. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెల‌సిందే. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ పోటా పోటీ ప్ర‌చారం చేస్తున్నాయి. జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు అనేక అడ్డదారులు తొక్కిన అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ గెలిచేందుకు వక్రమార్గాలు అన్వేషిస్తోంది.

కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ ఎంతకు దిగజారడానికైనా సిద్ధపడుతోందని విమర్శలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే ప్రచారంలో కుక్కలను సైతం టీడీపీ వదిలిపెట్టడం లేదు. శునకాలకు టీడీపీ పచ్చజెండాలు కట్టి కాకినాడ 11వ వార్డులో ఆ పార్టీ నేతలు తిప్పడం ప్రజలను విస్మయపరుస్తోంది.

కుక్కలకు పార్టీ జెండాలు చుట్టి ప్రచారం చేయడం చూస్తె ఎన్నిక‌ల‌కు టీడీపీ ఇంత దిగ‌జారిందాని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇంతకుముందెప్పుడు చూడలేదని కాకినాడ ఓటర్లు విస్తుపోతున్నారు. శునకాలకు టీడీపీ జెండాలను కట్టి ప్రచారం చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడలో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శిస్తూ.. సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌లో కుక్కలకు పచ్చ జెండాలు కట్టిన ఫొటోలు షేర్‌ చేసుకుంటున్నారు. మూగజీవులను సైతం రాజకీయ ప్రచారాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కోసం అధికార పార్టీ ఇలాంటి వికృత చేస్ట‌లు చేయ‌డం ఏంట‌ని అక్క‌డి ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -