దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలపై కొందరు మృగాల్లు అత్యాచార ఘటనకు పాల్పడుతున్నారు. ఇదంతా నానేకి ఒక వైపు మాత్రమే..నాణానికి మరోవైపు జరుగుతున్న ఘోరాలు తలచుకుంటుంటే అసలు మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. మహిళలు, అమ్మాయిలకు బయటే రక్షణ లేకుండా పోతుంటే ..ఇప్పుడు సొంత ఇంట్లోకూడా రక్షణ కరువైంది.
అయినవాళ్లే కన్న బిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. బాధితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్న ఘటనలు చాలానే జరిగాయి. గోరుముద్దలు తినిపించిన తల్లి తన మనసులోని కామబుద్దిని చూపించింది.జోలపాడాల్సిన చేతులు వేరే ఉద్దేశంతో ఒంటిని స్పృషిస్తాయని కలలో కూడా అనుకోలేదు. ఆలనాపాలనా చూసి ఓ అయ్య చేతిలో పెట్టాల్సిన తల్లే వెకిలి చేష్టలకు పాల్పడింది.
తమిళనాడులో తాజాగా జరిగిన ఘటన మరీ నీచాతి నీచం.. ఘోరాతి ఘోరం. కన్నతల్లి కూతురిని లైంగికంగా వేధించడం మాటల్లో కూడా చెప్పలేని జుగుస్పాకరమైన దారుణం. చెన్నైలోని తేనాంపేటకు చెందిన మహిళ కుటుంబ కలహాలతో తన భర్త నుంచి విడిపోయింది. ఆమె తన 14ఏళ్ల కూతురు, తల్లితో కలిసి ఉంటోంది. కొద్ది రోజులుగా కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లి.. తన కూతురిని వేధిస్తోంది. స్వలింగ సంపర్కానికి బలవంతం చేస్తూ.. ఆమెను చిత్రహింసలు పెట్టింది. తప్పని చెప్పాల్సిన బామ్మ కూడా అమ్మకు వత్తాసు పలుకుతుండడంతో భరించలేక తండ్రి సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి లైంగికంగా వేధిస్తోందంటూ ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లి, బామ్మలను అరెస్ట్ చేశారు. సాక్ష్యంగా సెల్ ఫోన్ వీడియో ఆధారాన్ని వారికి అందజేశాడు. దీంతో పోలీసులు బాలిక తల్లిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చెన్నైలో జరిగిన ఈ దారుణమైన ఘటన సంచలనంగా మారింది.