తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి.మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 27న ఫలితాలు విడులకానున్నాయి.తెలంగాణలో మొత్తం 538 జెడ్పీటీసీ… 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి దరఖాస్తులను ఆన్ లైన్లో స్వీకరించనున్నారు.
మొదటి దశ ఎన్నికలు
నోటిఫికేషన్ తేదీ – ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ – మే 6
రెండో దశ ఎన్నికలు
నోటిఫికేషన్ తేదీ – ఏప్రిల్ 26
పోలింగ్ తేదీ – మే 10మూడో దశ ఎన్నికలు
నోటిఫికేషన్ తేదీ – ఏప్రిల్ 30
పోలింగ్ తేదీ – మే 14
స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం 32వేల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ప్రచార వ్యయాలకు పరిమితి విధించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.లక్షన్నర, జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు ఖర్చు చేయవచ్చు.