అవును నిజమని అంటున్నారు జేసి దివాకర్ రెడ్డి. రీసెంట్ గా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్యూలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో రెడ్డిలకు సిఎం అయ్యే అవకాశం ఇప్పట్లో లేదని చెబుతున్నారు.
దీనికి ఆయన కారణాలు కూడా చెప్పారు. అదేంటంటే రాష్ట్రాలు విడిపోయాక తమ సంఖ్యా బలం మరింతగా పడిపోవడమే కారణమని చెబుతున్నారు. దీనికి తోడు సరైన లీడర్ కూడా లేకపోవడం ఇంకో కారణంగా చెబుతున్నారు.
మరి ఈయనకు ఆంద్రప్రదేశ్లో 67 మంది ఎమ్మేల్యేలను కూడ గట్టుకొని ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఒక లీడర్గా ఎందుకు కనపడలేదో అని ప్రతిపక్షాల వారు, అదే సామాజిక వర్గానికి చెందిన చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
ఈ మాట జగన్ చిన్న వాడైనా, ప్రజల్లో ఆదరణ చాలా బాగుందని తెలిసి, ఓర్వలేక చెప్పిన మాట అని రెడ్డి వర్గాల వాదన. ఈ మాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నది వీరి వాదన.
కేవలం అధికారంలో ఉన్న టిడిపిని సంతృపి పరచి, రాజకీయ లబ్ది కోసమే జేసి దివాకర్ రెడ్డి ఇలా మట్లాడుతున్నారని అంటున్నారు.