తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ దివాకర్రెడ్డి… భట్టి విక్రమార్క, జీవన్రెడ్డితో సరదాగా మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్కు నష్టం చేశారన్నారు. కొందరు తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారని.. పార్టీకి రాసిపెట్టిన కాలం అయిపోయిందని వెల్లడించారు.
జైపాల్రెడ్డిని ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని కోరినా.. ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. రాయల తెలంగాణ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదనగా.. కర్నూలు, అనంతపురం కలిపాలని కోరగా.. కొందరు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు నోటీసులపై జేసీ చురకలంటించారు. పోలీస్ అధికారి వచ్చి నోటీసు ఇచ్చారని.. జగన్, విజయసాయిరెడ్డికి తాఖీదులు ఇవ్వాల్సి వస్తే లారీలో తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు.
సందీప్ రెడ్డి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్