Wednesday, May 1, 2024
- Advertisement -

సెక్యూరిటీ లేకుండా వెళ్లిన మోదీ.. ఇదే మొదటి సారి..!

- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… ఢిల్లీ లోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్​ను ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత బోధకుడు గురు తేగ్​ బహాదూర్​కు నివాళులు అర్పించారు. ఆయన త్యాగాలను స్మరించున్నారు.ప్రధాని పర్యటనలో భాగంగా ఎలాంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని, ట్రాఫిక్​ను కూడా నిలిపివేయలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటన ప్రధాని షెడ్యూల్​లో లేదని తెలిపాయి.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్​ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తోన్న నేపథ్యంలో మోదీ గురుద్వారా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయినా రైతులు వెనక్కి తగ్గడం లేదు. వణికించే చలిలోనూ నిరసన తెలుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -