Tuesday, April 30, 2024
- Advertisement -

రెండో టెస్ట్‌కు ఉప్ప‌ల్ స్టేడియం చుట్టూ భారీ భ‌ద్ర‌త ..

- Advertisement -

ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 12న భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరగబోయే రెండో టెస్టుకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. విలేకరులతో మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ..ఈ 1500 మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్‌ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, హెల్మెట్లు, మంచినీళ్ల సీసాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను అనుమతించేది లేదన్నారు. కాగా మ్యాచ్ చూసేందుకుగాను ప్రతిరోజు 4 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు భద్రత అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్‌ తీసుకెళ్లవచ్చునని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -