Wednesday, April 24, 2024
- Advertisement -

నంద్యాల మీదుగా వెళ్లే వారికి గుడ్ న్యూస్..గరీబ్ రథ్ సిద్ధం..!

- Advertisement -

రైల్వే అధికారులు కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా గరీబ్ రథ్ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించారు. పూరి నుంచి యశ్వంత్ పూర్ ప్రాంతానికి.. యశ్వంత్ పూర్ నుంచి పూరీ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ఈ రైలును నడపనున్నారు.

గరీబ్ రథ్ రైలు( రైలు నంబరు 02063) నంద్యాల రైల్వేస్టేషన్​కు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు చేరుకొని 11.05కు యశ్వంత్ పూర్​కు బయల్దేరుతుంది.ఇదే రైలు ( రైలు నంబరు 02064) 17న(ఆదివారం) ఉదయం 7 గంటలకు నంద్యాల చేరుకుని 7.05 పూరి బయల్దేరుతుంది.

గరీబ్ రథ్ రైలు ఈ నెల 15న( శుక్రవారం) మధ్యాహ్నం 3.15 కు బయల్దేరి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం, హిందూపురం మీదుగా యశ్వంత్ పూర్​కు 16( శనివారం) రోజు రాత్రి చేరుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -