Thursday, May 16, 2024
- Advertisement -

అతడు డబ్బు పెడుతున్నాడని ఆ సినిమా నుంచి తప్పుకొన్నత్రిష!

- Advertisement -

వరుణ్ మణియన్ తో బ్రేకప్ ను ఇది వరకే ధ్రువీకరించిన త్రిష ఇప్పుడు మరో ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకొంది.

ఒక సినిమా నుంచి తప్పుకొని అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె ఎందుకు ఆ సినిమా నుంచి తప్పుకొంది? అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. చాన్నాళ్ల తర్వాత సెల్వరాఘవన్ ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా లో శింబుహీరో.. హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసుకొన్నారు.

ఇక్కడి వరకూ అంతా బాగుంది. సెల్వరాఘవన్ రీ ఎంట్రీ సినిమగా ఈ సినిమాకు గుర్తింపు వచ్చింది. మరి ఇలాంటి సినిమా నుంచి ఇప్పుడు త్రిష తప్పుకొన్నట్టుగా ప్రకటించింది.ఇలా తప్పుకోవడం వెనుక ఆసక్తికరమైన రీజన్లున్నాయని కోలీవుడ్ సమాచారం.
ఆ రీజన్ల వెనుక వరుణ్ మణియన్ పేరు వినిపిస్తుండటం విశేషం.  వరుణ్ అంటే.. త్రిష నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొన్న వ్యక్తి అని వేరే చెప్పనక్కర్లేదు. వరుణ్ కు సినిమా ఫైనాన్షియర్ గా మంచి పేరుంది. ఆయనే సెల్వ- శింబు ల సినిమాకు ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నాడు!
దీంతో త్రిష ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టుగా తెలుస్తోంది. వరుణ్ పెట్టుబడి పెడుతున్న సినిమాలో  నటించడం ఇష్టం లేక త్రిష ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా తెలుస్తోంది.మరి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొన్న వ్యక్తి తో మరీ ఇంతగా దూరంకావాలని త్రిష ఎందుకనుకొంటోంది. వరుణ్ – త్రిషల మధ్య అంత గొడవ జరిగిందా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -