గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అధికార పార్టీ ఊహించినట్లుగానే మెజార్టీ డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రేటర్ ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అంచనాలకు మించిన విజయాలు సాధిస్తుండటంతో తెలంగాణ భవన్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.
కేటీఆర్ సమర్థతకు నిదర్శనమని టీఆర్ఎస్ కేడర్ చెబుతోంది. ఒక్క పాతబస్తీ మినహా, మిగిలిన స్థానలల్లో అంతా టిఆర్ఎస్ మోత మోగిస్తుండటంతో, కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, మిగిలిన పార్టీ ఆఫీస్ లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.గ్రేటర్ లో తెలంగాణ ప్రభంజనానికి ఎదురన్నదే లేకుండా పోయింది.
ఈ ఫలితాల్లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండటంతో పార్టీ శేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్ వద్ద తెరాస కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.కేటీఆర్ జిందాబాద్ అనే నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగిపోయింది.