Wednesday, May 8, 2024
- Advertisement -

కెసిఆర్ కి భారీ షాక్ .. తెరాస లోంచి బీజేపీ లోకి మంత్రులు !

- Advertisement -

ఆపరేషన్ ఆకర్ష వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలనీ కుదిపేస్తోంది. తెరాస పార్టీ అధినేత కెసిఆర్ తెలంగాణా లో కాంగ్రెస్ నీ టీడీపీ నీ నిద్రపోనివ్వకుండా చేస్తుంటే ఇటు ఏపీ లో చంద్రబాబు వైకాపా కి చుక్కలు చూపిస్తున్నారు. ఇవాళ ఒక పార్టీ లో ఉన్న ఎమ్మెల్యే రేపు అదే పార్టీ లో ఉంటాడు అనే గారంటీ లేని పరిస్థితి అయిపొయింది.

ఇప్పుడు తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్ మొత్తం రివర్స్ అవ్వబోతోంది అంటున్నారు. తెరాస జోరుకు బ్రేక్ వేసే అంశాలు త్వరలో తెరమీదకి రాబోతున్నయట . కెసిఆర్ లోగుట్టు తెలుసుకుని ఇప్పుడు బీజేపీ రివర్స్ లో తెరాస కి షా ఇవ్వబోతోంది అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ ఎన్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కారులోని కొందరు కీలక మంత్రులు కారును వదిలేసి బీజేపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు.

అయితే.. ఎవరు కారు నుంచి జంప్ కానున్న విషయాన్ని తాను చెప్పలేనంటూ ఆయన చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు కారు నుంచి జంప్ అయ్యే నేతల వివరాల్ని చెబుతానని చెబుతున్న ప్రభాకర్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -