Wednesday, May 8, 2024
- Advertisement -

వరంగల్ లో 4.6 లక్షల మెజారిటీ తో తెరాస సంచలనం .

- Advertisement -

వరంగల్ ఉప ఎన్నికల ఓటింగ్ ఫలితాలు సంచలనం రేపుతున్నాయి, అధికార పక్షానికి దగ్గరకి కూడా రాలేక పోతున్నాయి ప్రతిపక్షాలు. భారీ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా కెసిఆర్ – తెరాస పార్టీ దూసుకుపోతోంది. ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు గంట గంట కూ చాలా ఆసక్తికరంగా సాగుతోంది.

పోటీ లేకుండా కారు జోరు దూసుకుపోతోంది. వరంగల్ లో ఉన్న లోక్ సభ నియోజికవర్గం లో ఏడు అసంబ్లీ సెగ్మెంట్ లలో మూడు అసంబ్లీ స్థానాలలో తెరాస కి భారీ ఎదురు దెబ్బ తగలచ్చు అని అని అన్నారు విశ్లేషకులు. ఇది నిన్నటి మాట కానీ దానికి భిన్నంగా మొత్తం ఏడు అసంబ్లీ సెగ్మెంట్ లలో తెరాస అభ్యర్ధి తిరుగులేకుండా తన సత్తా చాటుతున్నారు.

ఉదయం 12 సమయానికి తెరాస అభ్యర్ధి పసనూరి దయాకర్ మూడు లక్షలు ఆధిక్యత ని పొందారు, తెరాస కి పోల్ అయిన ఓట్లు 4.6 లక్షల మార్కు దాటడానికే ఈయన కి ఆధిక్యం 4.6 లక్షలు దాటడానికే మధ్య సమయం కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే. ఇక దయాకర్ ఎంపీ అవడం లాంచనం మాత్రమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -