ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ అందింది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న గ్రూప్1 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. సోమవారం పోలీస్ శాఖలో 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాకా విడుదలైన గ్రూప్ 1 తొలి నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం.
ఇంటర్వ్యూలు లేకుండానే ప్రిలిమ్స్, మొయిన్స్ ద్వారానే నియామకాలు చేపడతారు. ప్రిలిమ్స్ పరీక్ష జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష నవంబరు లేదా డిసెంబరు నెలలో నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్-1 సర్వీసెస్లో తొలిసారి ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ను అమలు చేయనున్నారు.
తెలుగు, ఆంగ్లంతో పాటు తొలిసారిగా ఉర్దూలో కూడా గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-1కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా టీఎస్పీఎస్సీలో విధిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఓటీఆర్ సవరించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.