Thursday, May 16, 2024
- Advertisement -

విశాఖ‌లో క‌ల‌క‌ల‌కం రేపిన జంట హ‌త్య‌లు..

- Advertisement -

విశాఖపట్నం జిల్లాలో జంట హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నడిరోడ్డుపై కత్తులతో దండగులు హల్ చల్ చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హత్యకు గురయ్యారు.నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తిని కారులో వచ్చిన ఓ ముఠా అత్యంత కిరాతకంగా నరికి చంపింది. అనంతరం అదే కారులో అక్కడ్నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి తమిళనాడుకు చెందిన నీలమగ అమరన్‌గా గుర్తించారు.మృతుడు మధురైలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గంజాయి వ్యాపారులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు.

మరోవైపు విశాఖ జగదాంబ సెంటర్లో మరో హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. జగదాంబ జంక్షన్ ఓ ఆప్టెక్స్ సమీపంలో శ్రీరాములు అనే వ్యక్తి పువ్వుల దుకాణం నడుపుతున్నారు. ఇందులో రెల్లివీధికి చెందిన సైకో శ్రీను, కొబ్బరి తోటకు చెందిన నూకరాజు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీను, నూకరాజు ఘర్షణకు దిగారు. ఇదే సమయంలో నూకరాజుపై శ్రీను కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నూకరాజు మెడకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూకరాజు మృతి చెందాడు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -