Saturday, April 20, 2024
- Advertisement -

టీ డీపీకి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి రాజీనామా…..

- Advertisement -

తెలంగాణాలో టీడీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఉమామాధవ రెడ్డితో పాటు ఆమె కుమారుడు సందీప్‌ రెడ్డి బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు.

ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివ‌రించారు. కార్యకర్తలతో చర్చించిన మీదటే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే పార్టీని వీడినట్టు తెలిపారు. తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులిచ్చి ఎంతో గౌరవించారన్నారు. దశాబ్ధాలుగా టీడీపీతో తమ కుటుంబానికి అనుబందం ఉందని పేర్కొన్నారు.

ఉమా మాధవ్‌ రెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డితో పాటు తమ అనుచరులతో కలిసి ఈ నెల 14 (గురువారం)న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఆమె సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -