మొబైల్ ఫోన్లకుఆర్థికమంత్రి అరుణ్జైట్లీ షాకిచ్చారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. నేడు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి అరుణ్జైట్లీ ఈ ప్రకటన చేశారు.
2017 డిసెంబర్లోనే దిగుమతి చేసుకునే స్మార్ట్ఫోన్లపై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. మరో నెల వ్యవధిలోనే మరోసారి మొబైల్ ఫోన్లకు కేంద్రం షాకిచ్చింది. ఈ ప్రభావం ఎక్కువగా ఆపిల్ వంటి కంపెనీలపై ప్రభావం చూపనున్నట్టు టెక్ వర్గాలు చెప్పాయి. చైనా ఫోన్లపై మరింత ప్రభావం ఉంటుందన్నారు.
మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా విదేశాల నుంచి మొబైల్ఫోన్ల దిగుమతిని తగ్గించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని రూ.15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఇప్పటికే శాంసంగ్, షియోమి వంటి పలు మొబైల్ కంపెనీలు భారత్ లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నాయి.నిపుణుల అంచనాల ప్రకారం ఒక్కో ఫోన్ ధర రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ పెరిగే అవకాశం ఉంది.
గత నెలలోనే మొబైల్ ఫోన్లపై కస్టమ్ డ్యూటీతో పాటు టీవీలు, మైక్రోవేల్ అవెన్లపై కూడా కస్టమ్స్ డ్యూటీని కేంద్రం 20 శాతానికి పెంచింది. తద్వారా విదేశీ దిగుమతులు తగ్గి దేశీయ కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫోన్లను భారత్లో తయారుచేసే విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు పరోక్ష పన్నుల కన్సల్టెన్సీ ఈవై హెడ్ బిపిన్ సప్రా తెలిపారు. కొన్ని వాహనాల పరికరాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచారు.
ఆరెంజ్ జ్యూస్లు కూడా కూరగాయలు, పండ్ల జ్యూసుల ధరలు కూడా 50 శాతం పెరుగనున్నాయి. గోల్డ్ , సిల్వర్పై సాంఘిక సంక్షేమ సర్ఛార్జీని విధించారు. స్మార్ట్వాచస్, ఫుట్వేర్ భాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచారు.