- Advertisement -
వెంకయ్యనాయుడిని వి.హనుమంతురావు ఏకంగా మన్మోహన్ సింగ్ ను చేసి పారేశారు.
పదేళ్ల పాటు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తెచ్చి పెడతామని హామీ ఇచ్చిన బిజెపి నేతలు ఆ విషయం మరిచారని చెప్పారు.మరీ ముఖ్యంగా ఆ రోజున భారీ డైలాగ్ లు చెప్పిన వెంకయ్యను…. సీమాంధ్రలో అడుగు పెట్టనీయెద్దని సలహా ఇచ్చారు.
విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను తాను తప్ప మరొకరు కాపాడలేరని ప్రగల్బాలకు పోయిన వెంకయ్య…. ఇపుడేం సమాధానం చెబుతారని హనుమంతన్న ప్రశ్నించారు.
మన్మోహన్ సింగ్ మౌనముని అని కామెంట్ చేసిన వెంకయ్య ఇపుడు తానేంటనేది తెలుసుకోవాలని చురకలు అంటించారు. చంద్రబాబుతో పాటు వెంకయ్య కూడా ఇపుడు రెండు నాల్కల ధోరణి అవలింభిస్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు.మరి హనుమంతురావు చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు.