- Advertisement -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బరిలో అనూహ్య పరినామాలు చోటు చేసుకుంటున్నాయి. విశాల్ నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. విశాల్ నామినేషన్ను బలపరుస్తూ సంతకాలు చేసినవారి పేర్లు తప్పుగా ఉండటంతో ఆయన నామినేషన్ను ఈసీ పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.
తన నామినేషన్ తిరస్కరించడంతో ఆర్కేనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట తన మద్దతు దారులతో ధర్నాకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్ను తిరస్కరించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించాడు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.