Sunday, May 5, 2024
- Advertisement -

అధికారంలోకి రాగానే ఉద్యోగాల క‌ల్ప‌న‌లో కొత్త చ‌ట్టాల‌ను తీసుకొస్తాం జ‌గ‌న్‌..

- Advertisement -

వైసీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగా విప్ల‌వాన్ని తీసుకొస్తామ‌న్నారు జ‌గ‌న్‌. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 ల‌క్ష‌ల ఉద్యోగాల్ని భ‌ర్తీ చేస్తామ‌న్నారు. గ్రామ పంచాయతీల ద్వారా మరో లక్షన్నర ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు.

మన రాష్ట్రం.. మనకే ఉద్యోగాలు’ అంటూ నినదించారు. ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లను జారీ చేసి, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ… నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని జగన్ విమర్శించారు. కొన్ని ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత కోర్టు కేసులు అంటూ నియామకాలను ఆపేశారని చెప్పారు. నల్లధనాన్ని దాచుకోవడానికే చంద్రబాబు దావోస్ వెళ్లారని ఆరోపించారు.

చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల వ‌ల్ల ఎన్ని పెట్టుబ‌డులు వ‌చ్చాయో చెప్పాల‌న్నారు. ప్ర‌త్యేక‌హోదా ఉంటేనే ఎవ‌రైనా పెట్టుబ‌డులు పెట్టేదానికి పార‌శ్రామిక వేత్త‌లు ముందుకు వ‌స్తార‌న్నారు. విదేశీ టూర్ల‌తో ప్ర‌జాధ‌నాన్ని వృధాచేయ‌డం త‌ప్ప మ‌రోక‌టి కాద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -