ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయిని పరామర్శించేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్నాయకులు వస్తున్నారు. ప్రధాని మోదీ వచ్చిన వెంటనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాజ్ పేయిని పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మమతా బెనర్జీ కోల్ కతా నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు ఓ ట్వీట్ చేశారు. వాజ్ పేయిని చూసేందుకు ఇవాళ తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నానని పేర్కొన్నారు. గతంలో వాజ్ పేయితో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి అని, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. నాడు వాజ్ పేయి ప్రభుత్వం పడిపోతున్నప్పుడు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మమత ఈ సందర్భంగా ప్రస్తావించారు.
I have cancelled my work to visit #AtalBihariVajpayee today. I got chance to work with him. He is a statesman like figure. We supported him when his govt was falling. His pattern of work was different & not like present politics: Mamata Banerjee, West Bengal CM pic.twitter.com/CmdFV0aJ0V
— ANI (@ANI) August 16, 2018