Saturday, April 27, 2024
- Advertisement -

సూపర్ స్టార్ సినిమా పై వస్తున్న ఆ వార్తల్లో ఇలాంటి నిజం లేదట!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మాంచి మాస్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకోని నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జనవరి ఎండింగ్లో దుబాయ్ లో ప్రారంభమయ్యింది. ప్రస్తుతం అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను సంగీత దర్శకుడు తమన్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఆన్ లొకేషన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు న్యూ లుక్ ను ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ బిజినెస్.. 35 కోట్లకు అమ్ముడు అయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తల్లో నిజం లేదన్నది తాజా సమాచారం.

ఇంకా ‘సర్కారు వారి పాట’ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను ఎవ్వరికీ అమ్మలేదట. అయితే అంత పెద్ద మొత్తం ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనట. కానీ ముగ్గరు నిర్మాతలు.. డిస్కస్ చేసుకుని చెబుతామని.. ఆ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టారట. 2022 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు…

అప్పుడు రోజా.. ఇప్పుడు ఎంపీ లు.. మైక్ లో దొరికిపోయారు..!

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లేటెస్ట్ అప్ డేట్!

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన జబర్ధస్త్ కమెడియన్..!

వెనక్కి తగ్గం అంటున్న రైతులు.. నేడు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -