Friday, March 29, 2024
- Advertisement -

హీరో న‌వ‌దీప్‌ను కాపాడేందుకు రంగంలోకి దిగిన టాప్ హీరోలు ఎవ‌రు…?

- Advertisement -

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేస‌లు ఎక్సైజ్ శాఖ అధికార‌లు నోటీసులు పంపించిన వారిలో ముఖ్యంగా న‌వ‌ దీప్, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, శ్యామ్ కే నాయుడు, శ్రీనివాస రావు, తరుణ్, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నందు తదితరులకు పోలీసులు నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అందించినట్లుగా తమకు సమాచారం అందిందని టీవీ ఛానల్స్ పేర్లు వెల్లడిస్తున్నాయి. పూరీ జగన్నాథ్‌కు కెల్విన్ సరఫరా చేసినట్లుగా తెలుస్తోందని పేర్కొంటున్నాయి. వీరందరికీ గచ్చిబౌలిలోని ఓ పబ్ అడ్డా అని తెలుస్తోంది. ఆ పబ్‌లో నవదీప్‌కు అనధికార వాటా ఉందని కూడా సమాచారం. మరోవైపు, కేసు నుంచి నవదీప్‌ను తప్పించేందుకు అయిదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోందని పేర్కొంది.
డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న నవదీప్ ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగారని సమాచారం. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన ప్రతిసారీ నవదీప్ పేరుపై చర్చ జరుగుతోంది. తాజాగా ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ లింకులపై దర్యాప్తు ప్రారంభించిన వెంటనే నవదీప్ అప్రమత్తమయ్యాడని సమాచారం.
దీంతో నవదీప్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఐదుగురు అగ్రహీరోలను రంగంలోకి దించాడని తెలుస్తోంది. నవదీప్ ఆ ఐదుగురు అగ్రహీరోలకు ఎప్పటికప్పుడు కాస్ట్ లీ పార్టీలు అరేంజ్ చేసేవాడని సమాచారం. దీంతో నవదీప్ పై వారికి అంతులేని ఆపేక్ష అని, దీంతోనే వారు నవదీప్ ను రక్షించేందుకు రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఆ ఐదుగురు అగ్ర‌హీరోలు ఎవ‌ర‌నేది ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -