Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దాడి చేసిన శ్రీనివాస్ య‌జ‌మాని టీడీపీ నేతే..

- Advertisement -

విశాఖనుంచి నుంచి హైద‌రాబాద్ బ‌య‌ల్దేరిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఎయిర్‌పోర్ట్‌లో దాడి ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అత్యంత భద్రత ఉండే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జగరడం.. తీవ్ర సంచలనం రేపుతోంది.

సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చిన శ్రీనివాస్‌ అనే వెయిటర్‌ కోడిపందెలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అయితే శ్రీనివాస్‌ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం అని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ల్యాంజ్‌ క్యాంటీన్‌ యాజమాని హర్షవర్ధన్ క్యాంటీన్‌లో వేయిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

క్యాంటిన్ ఓన‌ర్ హర్షవర్థన్‌ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతను గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్‌ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ కాంట్రాక్ట్‌ వచ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అతని క్యాంటీన్‌లోనే పనిచేస్తున్న శ్రీనివాస్‌ భద్రత తనిఖీల కళ్లుగప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడు? అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు వెలుగులోకి రావు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -