అక్రమసంబాధాలు కుంటుంబాల్లో విషాద ఛాయలను నింపుతున్నాయి. వివాహేతర సంబంధం మోజులో పడి సొంత భర్త, పిల్లలను సైతం అతి కిరాతంగా చంపుతున్న సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. భర్త కారు డ్రైవర్తో అక్రమసంబంధం పెట్టుకొని భర్తనే చంపించిన సంఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
హైద్రాబాద్ వవనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకొన్న సంఘటన పోలీసుల సహాయంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త చనిపోతే అతని ఉద్యోగం, ఇన్సురెన్స్ సొమ్ము తనకు వస్తుందని ఈ ఘోరానికి పాల్పడింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కేశ్యనాయక్, పద్మ దంపతులు హైద్రాబాద్ లో స్థిరపడ్డారు.కేశ్యనాయక్ ప్రభుత్యోద్యోగి. కేశ్యనాయక్ వద్ద వినోద్ కారు డ్రైవర్ గా పనిచేసేవాడు.అయితే వినోద్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డు తొలగించుకొంటే ఉద్యోగంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు… ప్రియుడు తనకు దక్కుతాడని ఆమె భావించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
రెండు రోజుల క్రితం గుర్రంగూడ సమీపంలో కారులోనే కేశ్యనాయక్ ను పద్మ, వినోద్ హత్య చేశారు. ఆ తర్వాత కారును ఎలక్ట్రిక్ పోల్ కు ఢీకొట్టారు. కారు ప్రమాదంలో కేశ్యనాయక్ మృతి చెందినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. కేసును విచారణ చేసిన పోలీసులు పద్మపై అనుమానం వ్యక్తం చేశారు.
ఆమెను విచారిస్తే అసలు విషయాన్ని ఒప్పుకొంది. కారులోనే భర్తను ఊపిరాడకుండా హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు చెప్పింది. దీంతో పోలీసులు హత్యకు పాల్పడిన పద్మ, వినోద్లను అరెస్టు చేశారు.