భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఘటన గుంటూరు జిల్లాలోమ చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…. గుంటూరు జిల్లా పొన్నూరు వీవర్స్ కాలనీకి చెందిన సత్యంశెట్టి శ్రీనివాసరావు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.నెలలో కొన్ని రోజుల పాటు నైట్ డ్యూటీకి వెళ్లేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావుకి వట్టిచెరుకూరుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై శ్రీనివాసరావుకు, అతడి భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే వీరి మనస్పర్థలు పసిగట్టిన పక్కింట్లో ఉండే కారు డ్రైవర్ ఆకుల నరేశ్.. శ్రీనివాసరావు భార్య పార్వతిని లోబరచుకున్నాడు.
విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తన స్నేహితులతో వచ్చి నరేశ్కు వార్నింగ్ ఇచ్చాడు. దీనిని అవమానంగా భావించిన నరేశ్.. శ్రీనివాసరావును చంపాలని నిర్ణయించుకున్నాడు.దసరా పండుగ రోజు ముందు రాత్రి వారందరూ నరేశ్ ఇంటిలో నిద్రించారు.. పండుగ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు డ్యూటీకి వెళుతున్న శ్రీనివాసరావును గమనించారు.ఇదే సరైన సమయంగా భావించిన నరేశ్, సుబ్రమణ్యం, గోపి కలిసి శ్రీనివాసరావును హత్య చేశారు.హత్య జరిగిన రోజు నరేశ్ ఇంట్లో లేకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది.. శ్రీనివాసరావు హత్యకు కారణం అతడేనని భావించి పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని హత్య చేసింది తానేనని స్థానిక వీఆర్వో వద్ద నరేశ్ అంగీకరించాడు.