Thursday, May 16, 2024
- Advertisement -

ప్రధానమంత్రి మోడీని మహేశ్ బాబు ఆకట్టుకొంటాడా?!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు నారా చంద్రబాబు నాయుడు , కేసీఆర్ లకు శ్రీమంతుడు సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారట. మహేశ్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాను వారి కోసం ప్రత్యేకంగా పదర్శించనున్నారని తెలుస్తోంది. ఊరిని దత్తత తీసుకొనే పాయింట్ మీద రూపొందించిన సినిమా కాబట్టి..

ఈ సినిమా ముఖ్యమంత్రులను ఆకట్టుకొంటుందని శ్రీమంతుడు యూనిట్ భావిస్తోంది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన సినిమా కాబట్టి ఇది రాజకీయ నేతలను ఆహ్వానించి ప్రదర్శించదగ్గ సినిమా అవుతుంది. 

ఇదే సమయంలో ఈ సినిమాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రదర్శించనున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ దత్తత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని.. ఏడాది రెండేళ్లలో ఆయా ఊర్ల గతిని మార్చివేయాలని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చాడు. మరి మహేశ్ బాబు ఈ సినిమాలో కూడా ఒక ఊరిని దత్తత తీసుకొంటాడు. కాబట్టి ఈ కథాంశం మోడీని ఆకట్టుకొంటుందని ఈ సినిమా వాళ్లు ఆశిస్తున్నారు.

ఈ కాన్పెప్ట్ ను వివరించి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయాలని శ్రీమంతుడు యూనిట్ ప్రయత్నాలు చేస్తోందట. మరి కాన్సెప్టును మెడీ చెవిన వేస్తే.. ఆయన ఈ సినిమాను చూడటానికి కొంత సమయాన్ని కేటాయిస్తాడని.. వారు భావిస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో వేచి చూడాల్సి ఉంది. ఇలా రాజకీయ నేతల కోసం ప్రదర్శన..శ్రీమంతుడు సినిమాకు ప్లస్ పాయింటే కాబోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -