అవును మీరు చదివింది నిజమే..! నిజామాబాద్కు చెందిన ఒక యువకుడు చేసిన ఘాతుకానికి ఒక అమ్మాయి బలైపోయింది. వివరాల్లోకి వెళితే… నిజమాబాద్కు చెందిన భూ లక్ష్మీ తన ఇద్దరు పిల్లలతో బాలానగర్ ప్రాంతంలోని వినాయక్ నగర్లో నివాసముంటోంది.
ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తన కుమార్తె అనూష గౌడ్కు, నిజామాబాద్ ప్రాంతానికి చెందిన సందీప్ గౌడ్ అనే యువకుడితో పెళ్ళి చూపులు పెట్టారు. అప్పుడు ఇద్దరూ ఒకే అనుకున్నారు. నిశ్చితార్థం వరకూ వెళ్ళారు. జూన్ 7వతేదీ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత కాబోయే భార్యతో ఫోన్ సంభాషణలు సాగించాడు.
అయితే ఉన్న ఫళంగా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చలేదు. నేను నిన్ను పెళ్ళి చేసుకోను.. నువ్వు ఇంకో వ్యక్తిని పెళ్ళి చేసుకో అని షాక్ ఇచ్చాడు. దీంతో ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాక తన తల్లికి ఉన్న విషయం చెప్పింది. ఆమె కూతుర్ని ఓదార్చి డ్యూటీకి వెళ్ళిపోయింది. తిరిగి వచ్చేసరికి కిచెన్లో తన కూతురు కొక్కేనికి వేళాడుతూ కనిపించింది.
వెంటనే ఆస్ప్రత్రికి తరలించగా అప్పటికే అనూష చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆ మాట విన్న తల్లి గుండెలవిసేలా ఏడ్చడం స్థానికుల్ని కలచి వేసింది. ఇలా చేసిన ఆ యువకుడి మీద స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.