సిద్దిపేటలో తల్లి ఘోరమైన దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరి పల్లల్ని కిరాతకంగా హత్య చేసింది. కుటుంబ కలహాల కారణంగా పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో పొడిచి అతి దారుణంగా చంపింది. ఈ ఘటన సిద్దిపేటలోని గణేశ్నగర్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సరోజ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గణేశ్ నగర్లో నివాసం ఉంటోంది. శనివారం తన ఇద్దరు కుమారులు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (రెండున్నరేళ్లు)ను నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో కర్కశంగా చంపేసింది. కొంత కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరగుతున్నట్లు సమాచారం. దీంతో తల్లి ఈ దారుణానికి వడిగట్టినట్లు తెలుస్తోంది.కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పిల్లలను హత్య చేసిన అనంతరం తల్లి సరోజ కరీంనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించడం.. స్థానికులను కంటతడి పెట్టించింది.