భూమా నాగిరెడ్డి మరణం వైసీపీ, టీడీపీల మధ్య మంటలు రేపింది. ఇరు పార్టీల అధినేతలు మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. భూమా నాగిరెడ్డి మరణానికి చంద్రబాబు కారణమంటూ దుయ్యబట్టారు మాటల యుద్ధం చేసింది. పార్టీలోకి చేరిన నాలుగో రోజు మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టి మనోక్షోభకు గురిచేశారని ఆరోపించారు.
తండ్రి మరణించి రెండ్రోజులు గాకుండానే.. కూతురు అఖిలప్రియను అసెంబ్లీకు రప్పించారంటూ జగన్ మాటలపై చంద్రబాబు గట్టిగానే సమాదానం ఇచ్చాడు. హైందవ సంప్రదాయం ప్రకారం ఎవరు చనిపోయినా తను వారింటికి వెళ్లి పలుకరిస్తానని చంద్రబాబు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగితే తాను ఉద్యోగాలు ఇప్పిచ్చిన విషయం గుర్తుచేశారు. పరిటాల రవి హత్యతో పాటు టీడీపీ కార్యకర్తలు 230 మందికి పైగా మరణించినా.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణించినపుడు తాను స్వయంగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన సంగతిని గుర్తు చేశారు. అఖిలప్రియను అసెంబ్లీకు రమ్మని తాము కోరలేదని. తానే స్వయంగా తండ్రిని స్మరించుకునేందుకు వచ్చినట్లు జవాబు ఇచ్చారు. జగన్కు తనకూ నక్కకు. నాగలోకానికి ఉన్నంత దూరం ఉందంటూ.. కనీస నవత్వంలేని వ్యక్తి గురించి మాట్లాడటం సమయం వృధా అన్నట్లుగా చెప్పేశారు.