వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో నేరాల చక్రవర్తి పేరిట త్వరలో జగన్ పై పుస్తాకాన్ని రిలీజ్ చేయనున్నట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు.
ఇటివలే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ చేసిన నేరాలు, ఘోరాలను సాక్ష్యాలతో సహా సవివరంగా వెల్లడిస్తామన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పుస్తకం అబద్ధాల పుట్ట అని అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ వైసీపీ పార్టీ.. ఆ పార్టీకి అధినేత గా ఉన్న జగన్ ప్రతిపక్ష నేతగా పనికి రారని మంత్రి యనమల విమర్శలు గుప్పించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకుడు జగన్ అని.. కోర్టు కేసులు, దొంగ దీక్షలతో జగన్ అభివృద్ధి చేసేది ఏమి లేదని.. యనమల అన్నారు. జగన్ పార్టీ పెట్టినప్పుడే కన్సల్టెన్సీ పెట్టుకోవాల్సిందని, పార్టీ పెట్టి ఆరేళ్లయ్యాక కన్సల్టెన్సీ పెట్టుకుని ఏం ఉద్ధరిస్తారని మంత్రి అన్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని వద్దన్న జగన్ ఇదే ప్రాంతంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పార్టీని నడిపిస్తున్నారని.. పేద ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఆయనకు లేదని విమర్శించారు.
{youtube}8xgiuw7xDNs{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related