Saturday, May 11, 2024
- Advertisement -

జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాకుండా వైసీపీనేత‌ను అడ్డుకున్న పోలీసులు..

- Advertisement -

జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాకుండా వైసీపీనేత‌ను అడ్డుకున్న పోలీసులు..

Ycp leader parthasarathi arrest  krishna district

Ysrcp leader, parthasarathi, arrest, krishna district, tdp, janmabhumi

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్థసారథి వెళుతుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని… జన్మభూమి సభలకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జన్మభూమి సభల్లో ప్రజల సమస్యలను లేవనెత్తే అవకాశం విపక్ష సభ్యులకు ఇవ్వడం లేదని అన్నారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగానే జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని సభలను నడిపిస్తున్నారని విమర్శించారు. వైయస్ హయాంలో విపక్ష నేతలకు కూడా మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం… విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని పార్థసారథి మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తన నోటికి నల్ల రిబ్బన్ కట్టుకున్నారు.

అలాగే వైఎస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జన్మభూమికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళుతున్న తమని భయపెట్టి నోరు మెదపకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -