ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. జాతీయ రహదారిని ఆనుకుని బహుదా నదికి సమీపంలో నిర్మించిన పాదయాత్ర పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
ముడంతస్తులుగా స్థూపం నిర్మాణం
13 జిల్లాలకు సూచికగా 13 మెట్లు
తొలి అడుగు ఇడుపులపాయ, చివరి అడుగు ఇచ్ఛాపురానికి గుర్తుగా మరో 2 అడుగులు
మొదటి అంతస్తులో 13 జిల్లాలతో కూడిన మ్యాచ్
రెండో అంతస్తులో వైఎస్ జగన్ నిలువెత్తు ఫొటోలు
మూడో అంతస్తులో నాలుగువైపులా వైఎస్ఆర్ చిత్రపటాలు
స్థూపం పైభాగంలో పార్లమెంట్ తరహా డోమ్
డోమ్పై వైఎస్ఆర్సీపీ జెండా