వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు పులివేందుల పోలీసులు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి వంట మనిషి కుమారుడు ప్రకాశ్లు సక్ష్యాలు తారుమారు చేసినందునె నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ప్రకటించారు వెల్లడించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పురోగతి లభించింది. ఉదయం లేఖ దొరికినా.. సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పీఏ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపరిచామని ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. బాత్రూమ్ లో ఉన్న వివేకా మృతదేహాన్ని బెడ్ రూమ్ కి తరలించారని, బెడ్రూమ్ లో ఉన్న రక్తపు ఆనవాళ్లు చెరిపేసి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని భావించిన పోలీసులు, ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే వున్నాడని నిర్ధారించారు. మృతదేహం దగ్గర ఉన్న సాక్ష్యాలను ఈ ముగ్గురు నిందితులు తారుమారు చేశారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరనేది మాతరం బయటకు వెల్లడించలేదు పోలీసులు.
- Advertisement -
వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గరు నిందితులు అరెస్ట్…
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -