- Advertisement -
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ టీడీపీతో కంటె ఎల్లోమీడియా ఛానల్లతోనే పోరాడుతోంది. నిత్యం టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీ వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టీవీ5ను బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పార్టీ కార్యాలయంనుంచి లెటర్ను విడుదళ చేసింది.
టీడీపీకీ అనుకూలంగా నిత్యం కథనాలు ప్రసారం చేస్తున్నందును టీవీ-5 ఛానల్ ను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.టీవీ-5 ఛానల్ లో జరిగే కార్యక్రమాల్లో వైసీపీ నేతలు ఎవరూ పాల్గొనరాదని ఆదేశాలు జారీచేసింది. అలాగే పార్టీ ప్రెస్ మీట్లు, కార్యక్రమాల కవరేజీలో టీవీ-5 ఛానల్ ను నిషేధిస్తున్నామని తెలిపింది. పార్ట కార్యక్రమాలకు, ప్రెస్మీట్లకు రాకుండా నిషేధిస్తున్నామని వైసీపీ తెలిపింది.

