- Advertisement -
ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థుల పై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఊహాగానాలకు తెరదించింది వైయస్ఆర్సీపీ.
వైయస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. 50 శాతం రాజ్యసభ సీట్లు బీసీలకు కేటాయించిన సీఎం వైఎస్ జగన్.