- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫైర్ అయ్యారు. జన్మభూమి పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను చెత్త బుట్టలో పడేసి …ఇప్పుడు కొత్తగా సాధించేదేమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా మారిందని ఎద్దేవ చేశారు. జన్మభూమి పేరుతో అధికారులు, స్కూల్ పిల్లలను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. పనిలో పనిగా ఆ రెండు ఊర్ల సంగతేంటని ప్రశ్నించారు. ఎవరి గ్రామాన్ని వాళ్లే అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. అయ్యా.. మరి మీ నారావారిపల్లె సంగతేంటి? అక్కడి స్కూల్ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఇక మీ తనయుడు లోకేశ్ బాబు దత్తత తీసుకున్న నిమ్మకూరు(ఎన్టీఆర్ స్వగ్రామం)లో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని విమర్శలు గుప్పించారు.