Friday, May 24, 2024
- Advertisement -

బాబు ఇంట్లో 12 గంట‌ల్లోగా సీబీఐచేత‌ త‌నిఖీలు జరిపించాలి…

- Advertisement -

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబుపై ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తిరుమల పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్, అమరావతిలలో ఉన్న తన నివాసాలకు తరలించారని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వజ్రవైఢూర్యాలను , ఆభరణాను ఇప్పటికే విదేశాలకు స్విట్జర్లాండ్ కు తరలించాడు .ఇంకా కొన్ని ఆభరణాలు బాబు ఇంటిలోనే ఉన్నాయ‌న్నారు.

12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్‌ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు. ఇటీవలే శ్రీవారి వంటశాలలోని నిధుల కోసం తవ్వకాలు జరిగాయని రమణదీక్షితులు కూడా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు… సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -