Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపి పోలీస్ విభాగంలో కీలక నిర్ణయం..!

- Advertisement -

సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారు.. కఠిన నేరాలకు పాల్పపడిన వారు కొన్ని సార్లు జైల్లో మరణిస్తుంటారు. అయితే ఇది లాకప్ డెత్ అని వారి బంధువులు ఆరోపిస్తూ తెగ హల్ చల్ చేయడం చూస్తూనే ఉన్నాం. లాకప్ డెత్ అనేది హేయమైన చర్యమాత్రమే కాదు.. చట్టాన్ని అతిక్రమించడం అన్న విషయం తెలిసిందే. ఇలాంటి లాకప్ డెత్ అయిన సందర్భంలో అధికారులపై చట్టరిత్యా చర్యలు కూడా తీసుకుంటారు. తాజాగా లాకప్ డెత్ లు, అక్రమ కస్టడీలు వంటి ఆరోపణల దృష్ట్యా.. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఠాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

మొదటి దశ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీస్​స్టేషన్​లో లాకప్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో సీసీకెమెరాలు అమర్చాలని గతేడాది డిసెంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 10 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ ప్రాజెక్టును చేపట్టారు. ఈ నేపథ్యంలో పెనుగంచిప్రోలు స్టేషన్‌లోని లాకప్ గదిలో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ఇందులో ఎక్కువ కాలం బ్యాకప్ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రవేశ ద్వారం, పార్కింగ్, ప్రాంతాల్లో రెండవ దశలో కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమర్చనున్న సీసీకెమెరాల్లో ఆడియో కూడా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలిదశలో ప్రతి స్టేషన్‌లో… స్త్రీ, పురుషుల లాకప్‌లకు ఒక్కొక్కటి చొప్పున కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1372 పోలీస్ స్టేషన్‌లలో కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి డీజీపీ నివేదిక పంపనున్నారు.

ఫస్ట్ మూవీతోనే షాక్ తిన్న ప్రియా ప్రకాష్ వారియర్…!

న్యాయవాద దంపతుల హత్య కేసులో.. కోర్టు తీర్పు..!

న్యాయవాద దంపతుల హత్య కేసులో కత్తులు దొరికాయి.. ఎక్కడంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -