Monday, May 6, 2024
- Advertisement -

అచ్చెన్నాయుడి అరెస్ట్ కు ముందు ఏం జరిగిందో చెప్పిన ఆయన భార్య..!

- Advertisement -

గతంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఈ రోజు ఉదయం అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ చేసేకంటే ముందు ఏం జరిగిందో అచ్చెన్నాయుడి భార్య విజయ మాధురి తెలిపారు. నిన్న రాత్రి 7.30 గంటలకే తాము ఏసీబీ అధికారులమంటూ తమ ఇంటిని చుట్టూముట్టారని.. తమకు ఏం జరుగుతుందో అర్దం కాలేదని తెలిపింది.

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందని.. రాత్రంతా ఆయనను నిద్రపోనివ్వలేదని.. ఇల్లు మొత్తం సోదాలు చేశారని.. కొన్ని వస్తువులు కూడా నాశనం చేశారని ఆమె ఆరోపించింది. అర్ధరాత్రి తరువాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే.. ప్రభుత్వందే బాధ్యతని అన్నారు. ఇక అచ్చెన్నాయుడి అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేస్తారా అని.. ఇందుకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేయడం అనేది కుట్ర అని అన్నారు. ఫోనులో మాట్లాడుదాం అనుకున్న కానీ ఇంతలోనే అయనను అందుబాటులో లేకుండా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు శకం ముగిసినట్టేనా…? పవన్ ను పట్టించుకోవడం లేదా….?

జగనన్న చేదోడు పథకం ప్రారంభం.. నేరుగా అకౌంట్లలోకి రూ.10వేలు..!

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య స్పందన..!

గుండెలు బాదుకునోళ్లు.. సిగ్గుతో బిగుసుకు పోయారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -